మెహన్ బాబు ఇంటి నుంచి ఓ మల్టీస్టారర్ సినిమా వస్తోంది. అదే… ‘పాండవులు పాండవులు తుమ్మెద’. మోహన్ బాబు విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ కథానాయకులు. రవీనా టాండన్, హన్సిక, ప్రణీతలు హీరోయిన్స్. శ్రీవాస్ దర్శకుడు. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బప్పి లహరి, అచ్చు సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలను ఈ నెల 11 న విడుదలకానున్నాయి. చిత్రాన్ని జనవరి 31న తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.