అత్తారింటిని అడ్డుకుంటాం!

pavankalyanమెగా హీరోల టైం అస్సలు బాలేదు. రాష్ట్ర విభజన ఆందోళనలతో… ఇరు ప్రాంతాల్లోనూ వీరి సినిమాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పవన్ అత్తారింటికి ఇప్పటికే పైరసి రూపంలో ఓ షాక్ తగిలింది. ఇక ఆలస్యం చేస్తే లాభం అనుకున్న ఈ చిత్ర బృందం ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఓయూ జేఏసీ ‘అత్తారింటికి దారేది’ని అడ్డుకుంటామని హెచ్చరించింది. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రి చిరంజీవి అడ్డుపడుతున్నందుకే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. జేఏసీ నేతలు రాజు, రవి, నెహ్రూనాయక్ లు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. మొదట సామాజిక న్యాయమంటూ మాట్లాడిన చిరంజీవి, తర్వాత మాట మార్చి 1500 మంది తెలంగాణ విద్యార్థుల మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. తెలంగాణలో పవన్ సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ల యజమానులకు జేఏసీ నేతలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.