దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మద్రాస్ టాకీస్ అండ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్పై శ్రీమతి అనిత సమర్పణలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓకే కన్మణి’ చిత్రాన్ని ‘ఓకె బంగారం’ గా అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
గతం లో మణిరత్నం దర్శకత్వం లో సూపర్ సక్సెస్ అయిన ‘సఖి’ కంటే ఈ సినిమా గొప్పగా వుంటుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. ఓ మంచి చిత్రాన్ని త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు మణిరత్నం, దిల్రాజు కలిసి అందించబోతున్నారు. ఈ చిత్రం ఆడియోను మార్చి చివరి వారం లో విడుదల చేసి, ఏప్రిల్లో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.