ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ల కోసం కథలను సిద్ధం చేస్తున్నాడు..ముందుగా పవన్ చిత్రాన్ని పూర్తి చేసి , ఆ తర్వాత మహేష్ మూవీ మొదలు పెడతామని అనుకున్నాడు. కానీ మహేష్ ప్రస్తుతం మురుగుదాస్ చిత్రం చేస్తున్నాడు, ఇది పూర్తి కాగానే శ్రీమంతుడు ఫేమ్ కొరటాల శివ దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ నేపథ్యం లో త్రివిక్రమ్ , మహేష్ తో సినిమా మొదలు పెట్టాలంటే 2018 కావాలి , ఈ లోపు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తే బాగుంటుందని దిల్ రాజు కోరడం జరిగిందట.
త్రివిక్రమ్ కూడా పవన్ చిత్రం పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమా మొదలు పెడతామనే మాట చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..దీపావళి తర్వాత ఈ కాంబో ఫై అధికారిక ప్రకటన రానుంది. ఒకవేళ వీరిద్దరి కాంబో సెట్ అయితే రికార్డు బద్దలు అవడం ఖాయమంటున్నారు అభిమానులు.