కేజీఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్…కన్ఫాం అయినట్టే

కేజీఎఫ్ చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతునట్టు సమాచారం. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని కన్ఫాం చేశారు. తాజాగా ఒక యూ ట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన కన్ఫాం చేశారు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు .

ఈ సినిమా కంప్లీట్ అవ్వడం అంటే 2020 జూన్ అన్నమాట. అలాగే ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ 2 చేస్తున్నాడు. మరోవైపు వి.వి.వినాయక్ కూడా ‘అదుర్స్’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. టెంపర్ నుంచి సక్సెస్ ట్రాక్‌ ఎక్కిన ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ వరకు ఫ్లాప్ అనేదే లేకుండా దూసుకుపోతున్నాడు. మరోవైపు కొరటాల శివతో తారక్ ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు. అంతేకాదు మరోసారి వీళ్లిద్దరి కాంబోలో ఒక సినిమా ఉంటుందనే అనౌన్స్మెంట్ జరిగినా ఎక్కడ చడీ చప్పుడు లేదు. దీంతో ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో ఎటువంటి సబ్జెక్ట్‌తో సినిమా చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది.