ఎన్టీఆర్-నాగ్ ల మల్టీ స్టారర్ ??

nag ntrటాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల హవా గట్టిగానే నడుస్తుంది. మొన్న వెంకటేష్, మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును పండిస్తే, ఇప్పుడు మళ్లీ ఓ యంగ్ స్టార్ హీరో మరో అగ్రనటుడి తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. యంగ్‌టైగ‌ర్ ఎన్టీర్ ఓ మ‌ల్టీస్టార‌ర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడ‌నే స‌మాచారం ఇప్పుడు టాలీవుడ్‌లో బ‌లంగా వినిపిస్తుంది. ఎన్టీఆర్ తో బృందావనం లాంటి హిట్ట్ సినిమాను తీసిన వంశీపైడిప‌ల్లి మరోసారి యంగ్‌టైగ‌ర్‌తో ఓ మూవీను ప్లాన్ చేస్తున్నాట్టు సమాచారం. ఈ సినిమా మల్టీ స్టారర్ గా రూపొందుతుందనీ, ఇందులో నాగార్జున న‌టింప‌చేసేందుకు ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయట.మరి, వంశీ పైడిప‌ల్లి చేస్తున్న ఈ ప్రయ‌త్నాలు ఎంత వ‌ర‌కూ ఫ‌లిస్తాయో చూడాలి. ఒకవేళ స‌క్సెస్ అయితే, త్వర‌లోనే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, నాగార్జున కాంబినేష‌న్‌లో మరో మ‌ల్టీస్టార‌ర్ మూవీను చూడొచ్చని అభిమానులు తెగ ఖుస్ అవుతున్నారు.