కొత్త దర్శకులతో జట్టుకడితే లాభం లేదన్న విషయాన్ని ఎన్టీఆర్ ఇంతకాలానికి గ్రహించాడు. అందుకే.. ఇప్పుడు సీరియర్లపై దృష్టిపెట్టాడు. త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడో ఓకే అయ్యింది. అల్లు అర్జున్ తో సినిమా తీసిన తరవాత.. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో జత కడతాడు. ఈలోగా ఎన్టీఆర్ మరో సీరియర్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తనే.. పూరి జగన్నాథ్. ఆంధ్రావాలా తరవాత వీరిద్దరి కలయికలో సినిమా సెట్ కాలేదు. గతంలో ఎన్టీఆర్ కోసం కొన్ని కథలు సిద్ధం చేశాడు పూరి. కొన్ని కారణాల వల్ల.. వాటికి మోక్షం లభించలేదు. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ని కన్వెన్స్ చేయగల లైన్ చెప్పాడట పూరి. మరోవైపు మహేష్ – పూరి కలయికలో రానున్న హ్యాట్రిక్ చిత్రం.. కాస్త టైమ్ పట్టేలా ఉంది. అందుకే ఈలోగా ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కించేద్దాం అన్న ప్రయత్నాల్లో ఉన్నాడు పూరి. రభస తరవాత సెట్స్ పైకి వెళ్లే ఎన్టీఆర్ సినిమా ఇదే కావచ్చు.