ఇప్పటికే ఈ చిత్రం పై తార స్థాయి లో అంచనాలు ఏర్పడుతున్న తరుణం లో ఎన్టీఆర్ నటిస్తున్నాడనే వార్త ఇప్పుడు ఇంకాస్త సినిమా పై అంచనాలు పెంచుతుంది..ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.. చారిత్రక నేపథ్యం కలిగిన అంశం కావడంతో డైరెక్టర్ క్రిష్ సైతం ఈ చిత్రం పై చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తెరకెక్కిస్తున్నారు..ఇక కాస్ట్ విషయానికి వస్తే ఇప్పటికే హీరోయిన్ గా శ్రీయ కన్ఫామ్ అయ్యింది.అలాగే హేమ మాలిని తల్లి పాత్రలో నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు..