ఏంటి… కొరటాల మళ్లీ ఎన్టీఆర్‌తో చేస్తాడా..!

తన ప్రతి చిత్రం హిట్‌ సాధించడంతో సక్సెస్‌ దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కొరటాల శివ ప్రస్తుతం మహేష్‌ బాబు చిత్ర పనుల్లో బిజీగా ఉన్నాడు. గతంలో ఈ కాంభోలో ‘శ్రీమంతుడు’ చిత్రం విడుదలయ్యి మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఆ చిత్రం ఇద్దరి కెరియర్‌లో కూడా నిలిచిపోయే విధంగా కలెక్షన్లు రాబట్టింది. అంతకు ముందు కొరటాల శివ ప్రభాస్‌తో కలిసి ‘మిర్చి’ చిత్రాన్ని తెరకెక్కించి హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని మూట గట్టుకున్నాడు. ప్రస్తుతం మరోసారి మహేష్‌తో జతకట్టడానికి సిద్దమవుతున్నాడు. మహేష్‌ నటిస్తున్న ‘స్పైడర్‌’ చిత్రం పూర్తి కాగానే కొరటాల దర్శకత్వంలో నటించనున్నాడు.

మహేష్‌తో రెండో చిత్రం తర్వాత కొరటాల ఎన్టీఆర్‌తో రెండో సారి జత కట్టబోతున్నాడు. ఎన్టీఆర్‌ తర్వాత రామ్‌ చరణ్‌తో ఒక చిత్రాన్ని చేయనున్నాడు. గతంలో ‘జనతా గ్యారేజ్‌’ సమయంలో ఎన్టీఆర్‌కు, కొరటాల శివకు విభేదాలు వచ్చాయని, మళ్లీ ఈ ఇద్దరు కలిసి పని చేయాలనుకోవడం లేదని వార్తలు వచ్చాయి. దాంతో ఎన్టీఆర్‌, కొరటాల కాంభో మరోసారి రిపీట్‌ కాదేమో అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల, ఎన్టీఆర్‌తో కూడా మళ్లీ ఒక చిత్రాన్ని చేయడానికి సముఖత వ్యక్తం చేస్తున్నాడు. అందుకు ఎన్టీఆర్‌ కూడా ఒకే అన్నాడట.