Site icon TeluguMirchi.com

క్లైమాక్స్ విషయం లో ఎన్టీఆర్ కు మోసం జరిగిందా..?

ntr-janata-climaxఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ విడుదలకు దగ్గరపడుతున్న కొద్దీ చిత్రానికి సంబదించిన ఆసక్తికరమైన విషయాల బయటపడుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నారు. అసలు మేటర్ ఏంటి అంటే..

కొరటాల శివ ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు మలయాళం కూడా రిలీజ్ చేయడబోతున్నాడు. దానికి తగట్టే చిత్ర కాస్ట్ క్రూ కూడా కొంతమేరకు మలయాళ నటులనే తీసుకోవడం జరిగింది. మలయాళం లో మోహన్ లాల్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే గ్యారేజ్ ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా తెలుగు లో ఓ టైపు , మలయాళం లో ఓ టైపు రిలీజ్ చేసి సినిమా ఫై హైప్ తీసుకొచ్చాడు.

తాజాగా చిత్ర క్లైమాక్స్ విషయంలోనే అదే మాదిరి చేసాడట. తెలుగు క్లైమాక్స్ లో రౌడీలను ఎన్టీఆర్ చావబాదితే , మలయాళ వర్షన్ లో మాత్రం మోహన్ లాల్ రౌడీలను చంపేస్తాడట. అంతేకాదు క్లైమాక్స్‌లో మోహన్ లాలే లీడ్ ఎక్కవగా కనిపించేలా క్లైమాక్స్ తీయడం జరిగిందట. ఈ వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హీరోకు మోసం జరిగిందని ఫీల్ అవుతున్నారట. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెలా ఉండబోతుందో చూడాలి.

ప్రస్తుతం చిత్ర కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చారు. ఆగష్టు 12న హైద్రాబాద్‌లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోను పెద్ద ఎత్తున విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

Exit mobile version