ప్రస్తుతం ఫిలిం సర్కిల్ లో త్రివిక్రమ్ , వినాయక్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరితో ఒకరితో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ఫిక్స్ అవుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ మూవీ స్క్రిప్ట్ లో బిజీ గా ఉన్నాడు..ఇది పూర్తి అయి సినిమా విడుదల కావడానికి 2018 పడుతుంది..మరోపక్క వినాయక్ దర్శకత్వం లో అదుర్స్ 2 చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఎన్టీఆర్ కూడా తన సన్నిహితుల దగ్గర చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మూవీ గురించి ప్రస్తావించాడట. ఈ మూవీ తో వినాయక్ హిట్ కొట్టడం ఖాయమని , చిరంజీవి గారు రీ ఎంట్రీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడట..ఎన్టీఆర్ మాటలు చూస్తే నెక్స్ట్ మూవీ వినాయక్ తోనే ఉండబోతుందని అర్ధం అవుతుంది..