రాంచరణ్ కు బాద్ షా ఝలక్ !

ramcharn and ntrగత ఆదివారం భారీ ఏర్పాట్ల మధ్య జరిగిన జూనియర్‌ ఎన్టీయార్‌ తాజా చిత్రం ‘బాద్‌ షా’ ఆడియో వేడుకలో తొక్కిసలాట జరగడం, ఓ అభిమాని మరణంచడం తెలిసిందే. దీని పర్యావసానంగా ఇప్పుడు మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ తేజ పై పడబోతోందని వార్తలొస్తున్నాయి. ఇంతకీ తారక్‌ కీ, చరణ్‌ కీ లింకేంటంటే… అభిమానులతో వేడుకలే. ఇటీవల జరిగిన దిల్‌ షుక్‌ నగర్‌ బాంబుపేళుళ్ళ తర్వాత జరిగిన పెద్ద వేడుకలు షాడో, బాద్‌ షా. షాడో వేడుకలు ఫరవాలేదు కానీ బాద్‌ షా వేడుకలే రసాభసాగా మారడం, ఆ ఎఫెక్ట్‌ తదుపరి ఫంక్షన్‌ లపై పడడం జరిగింది. తొక్కిసలాటకే పరిమితం కాకుండా, ఒక అభిమాని మరణించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఎలాంటి భారీ వేడుకలకు అనుమతులివ్వడం కుదరదంటూ పోలీసులు ప్రకటించారు.

మార్చ్‌ 27, రాంచరణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆ రోజున భారీగా వేడుకలు నిర్వహించాలని, అభిమానుల మధ్య రాంచరణ్‌ కొత్త చిత్రాలైన ‘ఎవడు’, ‘జంజీర్‌’ టీజర్లు, ఫస్ట్‌ లుక్‌ లు విడుదల చేయాలని భావించినట్లు ఇదివరకే వార్తలొచ్చాయి. ఇప్పుడు బాద్‌ షా ఎఫెక్ట్‌ తో ఆ ఆశలపై నీళ్ళు కుమ్మరించినట్లయింది. మరి ఆ ప్లాన్స్‌ మారిపోతాయా లేక కేంద్రమంత్రి అయిన మెగాస్టార్‌ చిరంజీవి రంగప్రవేశాలు, సిఫార్సులు గట్రాలు ఏవైనా అసాధ్యాలను సుసాధ్యంగా మారుస్తాయో వేచిచూడాల్సిందే!