ఎన్నారైలను మోసం చేసిన చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవి పట్ల ఎన్నారైలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో డబ్బు పోసి ఆయనను చూద్దామని వస్తే కనీసం కనిపించకుండా వెళ్లిపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏంజరిగిందటే.. డల్లాస్ లో రెండు రోజుల పాటు జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ కు చెందిన మరికొందరు ప్రముఖులు వెళ్లడం జరిగింది. ఈ వేడుకలకు చిరంజీవి హైలైట్ గా ఉండబోతున్నారని ప్రచారం చేయడంతో ఆయన్ను చూసేందుకు అక్కడి తెలుగు వారు ఆసక్తి చూపించారు. దీంతో నిర్వాహకులు కూడా ఒక్కో టికెట్ కు 75 డాలర్ల నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేశారు.

అయితే శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో చిరంజీవి కనీసం.. ప్రసంగించకపోవడంతో టిక్కెట్లు కొన్న వారంతా నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి మాటలు విందామని , ఆయనను చూద్దామని ఎంతో డబ్బు పెట్టి టికెట్ కొంటె ఆయన కనీసం మాట్లాడలేదని , స్టేజ్ పైకి సైతం రాకుండా వెళ్లిపోయాడని వారు అసహనం వ్యక్తం చేసారు. స్టేజిపైకి రావాలని నిర్వాహకులు …పలుమార్లు చిరును ఆహ్వానించినా రాలేదని తెలుస్తోంది. చిరంజీవి ఆశించినంత స్థాయిలో జనం రాకపోగా…. ఆ హాల్ లో 50 శాతం సీట్లు ఖాళీగా దర్శనమివ్వడంతో చిరు వెళ్లిపోయినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.