వాయిదాల మీద వాయిదాలు పడుతూ… ఎలాంటి గ్లామర్ లేకుండా సంక్రాంతికి సిద్ధమైపోతోంది ‘ఎవడు’. ఇప్పటికీ ఈ సినిమా విడుదల తేదీ ఇదీ… అని కచ్చితంగా ప్రకటించడం లేదు. ఫేస్ ఆఫ్ సినిమాకి స్ఫూర్తిగా వచ్చిన సినిమా.. అని ప్రచారం జరుగుతున్నా – దర్శకుడు వంశీ మాత్రం దాన్ని తిప్పుకొడుతున్నాడు. మా సినిమాకీ, ఫేస్ ఆఫ్ కీ సంబంధం లేదంటున్నాడు. తాజా సమాచారం మేరకు.. ‘ఎవడు’ సినిమాలో ఏమీ లేదట. మొదటి పావుగంట…. థ్రిల్లింగ్ గా, మంచి ట్విస్టులతో చూపించిన దర్శకుడు అదే టెంపోని ఆ తరవాత కొనసాగించలేకపోయాడని టాక్! సినిమాపై కూడా చరణ్ అసంతృప్తితో ఉన్నాడట. చివరి నిమిషాల్లో ఎన్ని మార్పులు చేసినా అవేమీ సినిమాని వర్కువుట్ చేసేలా లేవని చరణ్ ఫీలవుతున్నాడట. ఇంత డల్ సినిమాకి సంక్రాంతికి, అదీ ’వన్’ సినిమాకి పోటీగా తీసుకొస్తే మరింత ప్రమాదం అని దిల్ రాజుకి సన్నిహితులు వారిస్తున్నా.. సంక్రాంతి సీజన్ తనని కరుణిస్తుందని దిల్ రాజు నమ్ముతున్నాడు. మరి ఏమవుతుందో చూడాలి.