Site icon TeluguMirchi.com

కొండచిలువను వాటేసుకున్న హీరోయిన్

బేసిగ్గా అమ్మాయలు సున్నితంగా వుంటారు. కానీ హీరోయిన్ నివేదా థామస్‌ మాత్రం చాలా సాహసి. ఎంత అంటే కొండ చిలువను చుట్టేసుకుంది అమ్మడు. ”బాబ్రా(కొండచిలువ)ను పరిచయం చేసుకోండి. ఆనందాన్ని కల్గించే చిన్న పని. కానీ అనుకున్నంత చిన్నదైతే కాదు” అని కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది నివేదితా.

ఈ ఫొటోలు చూసిన అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇది ఎలా సాధ్యమైంది?, నీకు చాలా ధైర్యం ఎక్కువ.. అంటూ ట్వీట్లు చేశారు జెంటిల్‌మెన్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక నివేదా థామస్‌. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఉత్తమ నటిగా సైమా అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత ‘నిన్నుకోరి’, ‘జైలవకుశ’ సినిమాతో హిట్‌ అందుకుంది.

ప్రస్తుతం తెలుగులో నాగశౌర్య కథానాయకుడిగా సాయిశ్రీరామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా ఆమెనే ఎంపిక చేశారు.

Exit mobile version