రెండిటితో ఒకేసారి రాబోతున్న పొట్టి భామ

పొట్టి పిల్ల అయినా చాలా గట్టి ప్లి అని నిరూపించుకున్న నిత్యా మీనన్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగు, తమిళ, మళయాల భాషల్లో మాంచి క్రేజ్‌ ఉన్న ఈ అమ్మడు ‘జనతాగ్యారేజ్‌’ చిత్రం తర్వాత మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. కారణం అడిగితే సక్సెస్‌లు వచ్చాయని వరుస సినిమాలు చేయడం కాదు, నా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వచ్చినప్పుడే చేస్తాను అని చెబుతూ వచ్చింది. నిత్యా చెప్పిన మాటలు అభిమానులు సంతోషపడినా కూడా తర్వాత నిరాశ పడుతున్నారు. తాజాగా ఈ అమ్మడికి రెండు అవకాశాలు నచ్చినట్టు తెలుస్తోంది.

కన్నడ చిత్రం ‘యూటర్న్‌’ తెలుగులో చేయడానికి నిత్యా మీనన్‌ను సంప్రదించారట. ఈ చిత్రాన్ని నిత్యా కూడా ఒకే చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించడానికి సిద్దమవుతోంది. దీంతో పాటు కె ఎల్‌ రామారావు నిర్మించనున్న చిత్రంలో కూడా నిత్యా మీనన్‌ నటించనుందట. మొత్తానికి ఒకేసారి రెండు మంచి ఆఫర్‌లు పట్టేసింది. ఈ రెండు చిత్రాలు కూడా ఇంచుమించుగా ఒకేసారి విడుదల అయ్యేలా ఉన్నాయి. ఈ పొట్టిపిల్ల ఒకేసారి రెండిటితో అభిమానుల ముందకు రాబోతుంది.