ఏమిటో ఈ మాయ సినిమాలో జంటగా నటించారు శర్వానంద్, నిత్యమీనన్. ఇప్పుడు రెండోసారి శర్వానంద్ నిత్యమీనన్ ప్రేమలో మునిగిపోయాడు. అవును.. ఈ ఇద్దరు మరోసారి తెలుగు ప్రేక్షకులను మురిపించబోతున్నారు. ఓనమాలు సినిమాతో ఆకట్టుకొన్న దర్శకుడు క్రాంతి మాధవ్. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఇప్పుడాయన మరోసారి మెగా ఫోన్ పట్టనున్నారు. క్రాంతి మధవ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శర్వానంద్, నిత్యమీనన్లను నాయకానాయికలుగా ఎంచుకొన్నట్టు సమాచారమ్. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఏమిటో ఈమాయ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.