హిట్ కాంబినేషన్ కి విలువ ఎక్కువ. ఒక్కసారి హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే… ఆ జంటను పదే పదే చూడ్డానికి అటు ప్రేక్షకులు, ఇటు సినిమా వాళ్లూ అలవాటు పడిపోతారు. నితిన్, నిత్యమీనన్ ల మధ్య అలాంటి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. ఇష్క్ సినిమాతో వీరిద్దరి జంట చూడముచ్చటగా కుదిరింది. అందుకే ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా కోసం కూడా నితిన్, నిత్యకే ఓటేశాడు. అతని సెంటిమెంట్… ఈ సినిమాలోనూ మంచి ఫలితాన్ని తీసుకొచ్చింది. వరుసగా రెండు విజయాలు ఇచ్చిన నిత్యమీనన్ ని వదలులుకోవడానికి నితిన్ సిద్ధంగా లేడు. ఇప్పుడు తన కొత్త సినిమాలోనూ కథానాయికగా నిత్య కావాలని అడుగుతున్నాడట. కొరియర్ బాయ్ కల్యాణ్ లో నిత్యను కథానాయికను చేయమని బలవంతం చేస్తున్నాడట. నిత్యని మూడో సినిమాకి తీసుకొంటే… హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని నితిన్ నమ్ముతున్నాడు. ఈ సినిమాకి సెట్ అవ్వకపోయినా.. తరువాతి సినిమాకైనా నిత్యని తీసుకోవలసిందే అని నితిన్ బాగా ఫిక్సయ్యాడట. నిత్యని నితిన్ ఎప్పుడు వదులుతాడో ఏమో?