Site icon TeluguMirchi.com

శ్రీకాళహస్తిలో భీష్మ సందడి..

గత కొంతకాలంగా సరైన హిట్ లేని నితిన్..భీష్మ తో సూపర్ హిట్ అందుకున్నాడు. శివరాత్రి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని ఓపెనింగ్ డే కలెక్షన్లు అదరగొట్టింది. వెంకీ కుడుముల డైరెక్షన్లో రష్మిక హీరోయిన్ గా నటించింది. చాల కాలం తర్వాత హిట్ పడేసరికి నితిన్ వరుసగా దైవ దర్శనాలు చేసుకుంటున్నారు.

నిన్న తిరుపతి వెళ్లిన నితిన్ ఈరోజు శ్రీకాళహస్తి విజయలక్ష్మీ థియేటర్ లో ప్రేక్షకుల మధ్య కూర్చుని చూసాడు. నితిన తో పాటు బోలెడు మంది మిత్ర బృందం వున్నారు. నిర్మాత, ఎఎమ్ఆర్ కంపెనీ అధినేత మహేష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే సోదరుడు విజయేందర్ రెడ్డి, కాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి , లోకల్ డిస్ట్రిబ్యూటర్ హరి ఇంకా అనేక మంది ఈ ప్రాంత ప్రముఖులు నితిన్ వెంట వున్నారు.

కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దగ్గర వుండి నితిన్ కు దర్శనం ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ ప్రముఖ పుణ్య క్షేత్రంలో తన కొత్త సినిమా చూడడం ఆనందంగా వుందని, సినిమాకు పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని అన్నారు.

Exit mobile version