Site icon TeluguMirchi.com

”నినువీడని నీడను నేను” ట్రైలర్ టాక్..

సందీప్ కిషన్, అన్య సింగ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ”నినువీడని నీడను నేను”. విస్తా డ్రీమ్ మర్చంట్స్‌తో కలిసి సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్, సందీప్ కిషన్ నిర్మాతలు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని సమర్పిస్తున్నారు.. జులై 12న విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర బృదం విడుదల చేసింది.

ట్రైలర్ చూస్తే.. సందీప్ కిషన్ ని వెన్నెల కిషోర్ ఆత్మ వెంటాడుతూ ఉంటుంది. అసలు వెన్నెల కిషోర్ ఎవరు, అతన్ని ఎవరు చంపారు, సందీప్ కి అతనికి సంబంధం ఏమిటి అనేది కథ అని తెలుస్తుంది. అలాగే 400 ఏళ్ల క్రితం ఇలాగే జరిగిన ఓ బాలుడి సంఘటన ను ప్రస్తావించడంతో గత చరిత్రలోని బాలుడికి ప్రస్తుత పాత్రలకి ఉన్న లింకేంటి అనేది సినిమా చూస్తే అర్ధం అవుతుంది .

Exit mobile version