మేనక గా నికీషా పటేల్

Nikisha Patel‘పులి’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన మెరిసిన ముద్దుగుమ్మ నికీషా పటేల్. ఆ సినిమా ఘోర పరాయజం పాలవ్వడంతో…. నికీషా వంక మన దర్శక నిర్మాతలు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. చాలా కాలం తరవాత కళ్యాణ్ రామ్ సినిమా ‘ఓం’లో ఆమెకు అవకాశం వరించింది. అయితే అది కూడా అనివార్య కారణాలవల్ల ఆగిపోయింది. ఇప్పడు ఆమెకు మరో ఛాన్స్ దక్కింది. ఎమ్ .యస్. రాజు నిర్మిస్తున్న ‘రమ్ ‘ సినిమాలో నికీషా మేనక గా కనిపించనుంది. ఈ చిత్రంలో త్రిష, పూర్ణ కదానాయికలుగా ఇదివరకే ఎంపికయ్యారు. రంభ, ఊర్వశి, మేనక ల కధ ఇది. త్రిష రంభ గా, పూర్ణ ఊర్వశిగా నటించనున్నారు. ఈ సినిమాలో కధానాయకుడు ఎవరనేది ఇంతవరకూ తెలియలేదు. వరుస వైఫల్యాల నేపధ్యం లో యమ్ .యస్ రాజు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.