ఎప్పటికప్పుడు ఏదో వివాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ, ఇటీవల రియో ఒలింపిక్స్ లో పీ.వీ.సింధు గెలిచినా పతకాల ఫై కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కాడు.. ” 32 కోట్ల జనాభా మాత్రమే ఉన్న అమెరికాకు 46 బంగారు పతకాలు సాధించింది, 5 కోట్ల జనాభా మాత్రమే ఉన్న దక్షిణ కొరియాకు 9 బంగారు పతకాలు సాధిస్తే , 120 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశం మాత్రం ఒకే ఒక్క రజత పతకం సాధించిందని ” ఎద్దేవా చేశాడు.
ఈ పోస్ట్ పై నెటిజన్లు కాస్త ఘాటుగానే స్పందించారు. అంతే కాదు ఓ నెటిజన్ వర్మ అన్ని మూసుకునేలా గట్టి పంచ్ వేసాడు..”కేవలం ఒకే ఒక్క మంచి సినిమా తీసి దర్శకుడిగా ఇంత హంగామా చేస్తుంటే , మరి ఎన్నో మంచి సినిమాలు తీసిన రాజమౌళి, శంకర్, బాలా లాంటి గొప్ప దర్శకులు ఇంకెంత హంగామా చేయాలి ” అన్న రీతిలో నెటిజన్ వేసిన పంచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ పోస్ట్ అందరూ షేర్ చేస్తా వర్మ కు పంపుతున్నారు. మరి దీని ఫై వర్మ ఏమంటాడు చూడాలి.