డీజే లో రానా సందడి..

అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ చిత్రం రేపు థియేటర్స్ లలో సందడి చేయనుంది..అల్లు అర్జున్ తో పాటు దగ్గుపాటి రానా కూడా మెగా అభిమానులను అలరించబోతున్నాడు..అదేలా అనుకుంటున్నారా రానా , కాజల్‌, కేథరీన్‌ జంటగా తేజ దర్శకత్వం లో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రానికి సంబదించిన ట్రైలర్ డీజే ప్రదర్శించే థియేటర్స్ లలో ప్రదర్శించబోతున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ.. ‘రానాలోని సరికొత్త యాంగిల్‌ను ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో చూస్తారు. ప్రేక్షకులు వూహించని విధంగా ఈ చిత్రంలో రానా కన్పిస్తారు. జోగేంద్ర పాత్రలో రానా ఒదిగిపోయిన విధానం అందిరినీ ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ విడుదల చేస్తున్నాం’ అని తెలిపాడు.