ప్రభాస్ సమస్య తీరిపోయింది.

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ చేయబోతున్న మూవీ సాహో..రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇప్పటికే పూజా కార్య క్రమాలు పూర్తి చేసిన చిత్ర యూనిట్ , మూవీ కాస్ట్ & క్రూ ఫై వేట కొనసాగిస్తున్నారు. ప్రభాస్ కు తగ్గ విలన్ కోసం చాలామందినే అనుకున్నారట..చివరకు బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాల్లో విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసిన నితిన్, ఇప్పుడు సాహో చిత్రం తో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. తమిళ్ లో వచ్చిన కత్తి సినిమాలో విలన్ గా నటించాడు. తెలుగు కత్తి రీమేక్ ఖైదీ లో కూడా ఇతడిని తీసుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ చివర్లో అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో సాహో తెరకెక్కబోతుండడం తో నితిన్ సరిగ్గా ఉపయోగపడతాడని చిత్ర యూనిట్ అతడిని ఎంపిక చేసినట్లు సమాచారం. మరో వారం నుండి ఈ మూవీ సెట్స్ ఫైకి వెళ్లనుంది. యువీ క్రియేషన్స్ ఫై ఈ మూవీ తెరకెక్కబోతుంది.