పంజా తీసి నిర్మాత నీలిమ తిరుమల శెట్టి ఏం వెనకేయలేదను గానీ, ఇప్పుడు పవన్ పేరు చెప్పి బోలెడంత పబ్లిసిటీ వెనకేసుకొందామని చూస్తోంది. నీలిమ ఇప్పుడు చిన్న సినిమాలపై దృష్టిపెట్టింది. అరెరె, అలియాజ్ జానకి సినిమాలు ఆమె సంస్థ నుంచి వచ్చాయి. అలియాస్ జానకి ఆడియో వేడుకకు పవన్ కల్యాణ్ని ఆహ్వానిద్దాం అనుకొంది. పవన్ని రిక్వెస్ట్ చేసింది కూడా. పంజా సినిమా తీసింది కదా..? అని పవన్ ఈ కార్యక్రమానికి వద్దాం అనుకొన్నాడట. కానీ రెండు రోజుల సమయం అడిగాడట. పవన్ రాడేమో అని… చిరు దగ్గరకు పరుగెట్టుకొంటూ వెళ్లింది నీలిమ. ఈ విషయం తెలిసి – పవన్ డ్రాప్ అయ్యాడట. అటు చిరంజీవి రాలేదు, ఇటు పవన్ కూడా రాలేదు. చివరికి నాగబాబుతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
ఇక ముందు మాత్రం పక్కా ప్లానింగ్తో పవన్ ని వాడుకోవాలని చూస్తోందీ నిర్మాత. పవన్తో ఉన్న ఫొటోలను… అలియాస్ జానకి పోస్టర్లుగా తీసుకురావాలనుకొంటోంది. అంతేకాదు తన సంస్థ నుంచి రాబోయే సినిమాల ప్రచారంలో పవన్ని దింపాలని ప్లాన్ చేస్తోంది. మరి ఈ ఎత్తుగడకు కాసులు రాలతాయే లేదో చూడాలి.