నయనతార ను ఖరారు చేసిన చిత్ర యూనిట్..

వరుస సక్సెస్ లతో అగ్ర దర్శకుడి గా స్థానంలో దూసుకెళ్తున్న కొరటాల శివ..ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ లో సెట్స్ పైకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం లో చిరంజీవి సరసన నయనతార ను హీరోయిన్ గా ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.

ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమా కోసం తన లుక్ ను మార్చుకునే పనిలో పడ్డాడు. స‌ల్మాన్ ట్రైన‌ర్ ఆధ్వ‌ర్యంలో క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఆహార నియ‌మాలు పాటిస్తూ తన లుక్ ను మార్చే పనిలో ఉన్నాడు. తాజాగా చిరంజీవికి సంబంధించిన ఓ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇందులో చాల స్లిమ్‌గా క‌నిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అలాగే ప్రముఖ యాంకర్ అనసూయ కూడా ఓ లీడ్ రోల్ చేస్తుండటం విశేషం. రామ్ చరణ్ తో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించబోతున్నారు.