టాప్ కథానాయికలు ప్రత్యేక గీతాల్లో ఆడిపాడడం కొత్తేం కాదు. కాకపోతే నయన తారలాంటి కథానాయికలు మాత్రం కాస్త రిజర్వ్గా ఉంటారు. ప్రత్యేక గీతాలంటే అంతగా ఆసక్తి చూపించరు. అలాంటి నయన కూడా.. ఇప్పుడు ఐటెమ్ పాటలో చిందేయడానికి రెడీ అయ్యింది. అదీ… రజనీకాంత్ చిత్రంలో. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హా కథానాయికలు. ఈ చిత్రంలో నయన ఓ ప్రత్యేక గీతంలో నర్తించడానికి ఒప్పుకొంది. దాంతో సూపర్స్టార్తో హ్యాట్రిక్ కొట్టినట్టైంది. అంతకు ముందు చంద్రముఖి, కథానాయకుడు చిత్రాల్లో రజనీ పక్కన ఆడిపాడింది నయన. ఇది ముచ్చటగా మూడోసారి. అయితే ఈ పాట కోసం నయన భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. చిత్రబృందం కూడా నయన అడిగినంత మొత్తం ముట్టజెప్పారు. మరి ఈ పాట ఎంత హాట్గా ఉంటుందో చూడాలి.