బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి పై సంచలన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే,. నవాజ్ సతీమణి ఆలియా సిద్ధిఖి పై అనుమానంతో నవాజుద్దీన్ కొంతమంది వ్యక్తులను నియమించి నిఘా పెట్టాడని, ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలను ఖండిస్తూ.. ఆలియా ఫేస్బుక్లో వివరణ ఇచ్చారు.
” న మా ఇద్దరిదీ 15 ఏళ్ల నాటి అనుబంధం. నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను. ఆయన ముస్లిం. కానీ ఆయన నాకు ఏ లోటు రానివ్వలేదు. ఆయన ఓ మంచి భర్తే కాదు మంచి తండ్రి కూడా. నవాజ్ నాపై ఇలా చేయించారని వస్తున్న ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుంది. త్వరలో నిజనిజాలు తెలుస్తాయి. ఆయన ఓ సెలబ్రిటీ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు’ అని క్లారిటీ ఇచ్చారు ఆలియా సిద్ధిఖి