Site icon TeluguMirchi.com

‘నాటు నాటు’ పాట కి ఆస్కార్ స్టేజీపై స్టెప్పులేసేది ఎవరో తెలుసా ?


జూనియర్ ఎన్టీఆర్ -రామ్ చరణ్‌లు కలిసి నటించిన RRRలోని ‘నాటు నాటు’ పాట తెలుగు వారిని మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయింది. కచ్చితంగా ఈ పాటకు ఆస్కార్ దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ ను లైవ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పెర్ఫార్మ్ చేయబోతున్నారు అని ముందు నుంచి ప్రచారం జరుగుతుండగా అదేమీ లేదని ఎన్టీఆర్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

తాజాగా అమెరికన్ నటి, డ్యాన్సర్ లారెన్ గాట్లీబ్ నాటు-నాటు పాటపై ఆస్కార్ వేదికపై కనువిందు చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మార్చి 12న ఆస్కార్ వేదికపై లారెన్ తన ప్రదర్శన గురించి చాలా ఉత్సాహంగా ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ‘‘స్పెషల్ న్యూస్. ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు నేను లైవ్ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన వేదికపై భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉంది’’ అని రాసుకొచ్చింది.

Exit mobile version