నారా వారి పుదీనా బిర్యానీ

భలే మంచి రోజు సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య . తొలి సినిమాగా తీసిన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు. సందీప్ కిష‌న్‌, నారా రోహిత్‌, ఆది, సుధీర్ బాబులతో ఓ మల్టీస్టారర్ తయారుచేస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లొకేషన్ లో హీరో నారా రోహిత్ తన ఫ్రెండ్స్ కు కమ్మని ట్రీట్ ఇచ్చాడు. నారా రోహిత్‌ తన యూనిట్‌ సభ్యుల కోసం కమ్మటి పుదీనా బిర్యానీ చేసి పెట్టాడు. నారా రోహిత్‌ యూనిట్‌ సభ్యుల కోసం పుదీనా బిర్యానీ చేశారని సుధీర్‌బాబు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్‌ విరామ సమయంలో నారా రోహిత్‌ చేసిన వంట చాలా రుచికరంగా ఉందని తెగ హ్యాపీ గా ఫీల్ అయిపోయింది యూనిట్.