ఆ సినిమా ఆగిపోయిందా?

nara-rohitఆర్థిక సంక్షోభం చిత్ర ప‌రిశ్రమ‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చాలా సినిమాలు మ‌ధ్యలోనే ఆగిపోతున్నాయి. సినిమాని పూర్తిచేయ‌లేక‌, మ‌ధ్యలో వ‌దిలేక‌య‌లేక నిర్మాత‌లు ఆప‌సోపాలు ప‌డుతున్నారు. ఈ సినిమాలో జాబితాలో ఇప్పుడు మ‌ద్రాసి కూడా చేరిపోయింది. నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం మ‌ద్రాసి గ‌తేడాది జూన్‌లో ఈ సినిమా కొబ్బిరి కాయ కొట్టుకొంది. 30 శాతం షూటింగ్ కూడా జ‌రిగింది.కానీ ఆర్థిక స‌మ‌స్యల‌తో ఈ సినిమా ఆగిపోయింది. విజ‌య్ లింగ‌మ‌నేని ద‌ర్శకుడిగా ప‌రిచయం అవుతున్న ఈ చిత్రానికి ర‌వి వ‌ల్లభ‌నేని నిర్మాత‌. ఇదొ యాక్షన్ థ్రిల్లర్‌. ఈ క‌థ‌పై న‌మ్మకంతో నారా రోహిత్ ఈ సినిమాని టేక‌ప్ చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామ‌నుకొన్నాడు. అయితే అది కూడా సాధ్యం కాలేదు. ఈ సినిమాని ప‌క్కన పెట్టి, ఆ త‌ర‌వాత మొద‌లైన ప్రతినిధిని పూర్తిచేశాడు రోహిత్‌. ఇప్పుడా సినిమా విడుద‌ల‌కు కూడా సిద్ధమైంది. ప్రతినిధి హిట్టయి, రోహిత్‌కి మార్కెట్ పెరిగితే… మ‌ద్రాసి తిరిగి సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.