Site icon TeluguMirchi.com

రాహుల్‌కు అక్కినేని మల్టీస్టారర్‌ బాధ్యతలు

హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్‌ రవీంద్రన్‌ పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా కొనసాగాడు. అలా కూడా పెద్దగా ఆఫర్లు రాలేదు. చివరకు రాహుల్‌ రవీంద్రన్‌ ‘చిలసౌ’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం నచ్చిన నాగార్జున ‘మన్మధుడు 2’ చిత్రం చేసే అవకాశం ఇచ్చాడు. తాజాగా ‘మన్మధుడు 2’ చిత్రం పూర్తి అయ్యింది. ఆగస్టు 9వ తారీకున సినిమా ప్రేక్షకలు ముందుకు రాబోతుంది. సినిమా విడుదలకు ముందే మంచి బజ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో మంచి బిజినెస్‌ అయ్యింది. దర్శకుడు రాహుల్‌ తన స్టైల్‌ ఆఫ్‌ వర్కింగ్‌తో నాగార్జున మనసు దోచుకున్నాడు. అందుకే చాలా పెద్ద బాధ్యతను అప్పగించబోతున్నట్లుగా తెలుస్తోంది.

నాగార్జున చాలా రోజులుగా కొడుకులు ఇద్దరితో ఒక మల్టీస్టారర్‌ను చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం కథలు రెడీ చేయమని పలువురికి సూచించాడు. ఇప్పుడు ఆ బాధ్యతను రాహుల్‌ రవీంద్రన్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. మన్మధుడు 2 చిత్రం హిట్‌ అయితే ఖచ్చితంగా అక్కినేని మల్టీస్టారర్‌ మూవీకి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తుంది. రాహుల్‌ రవీంద్రన్‌ ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. మూడవ సినిమాతోనే మంచి మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయబోతున్నందుకు రాహుల్‌ లక్కీ అని చెప్పాలి. చైతూ, అఖిల్‌ హీరోలుగా నటించబోతున్న చిత్రంలో నాగ్‌ గెస్ట్‌ రోల్‌ కూడా చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Exit mobile version