Site icon TeluguMirchi.com

అఖిల్‌, శ్రియాల పెళ్లిపై స్పందించిన నాగ్‌

కింగ్‌ నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని ‘అఖిల్‌’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రెండో చిత్రంతో ఎలాగైనా సరే హిట్‌ కొట్టాలనే ధృడ నిశ్చయింతో చాలా కష్టపడుతున్నాడు. ఈ సమయంలోనే అఖిల్‌కు తన ప్రేయసి జీవేకే మనువరాలు శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థ అయ్యింది. పెళ్లి ముహుర్తాలు పెట్టుకుని పెళ్లి దగ్గరపడుతున్న వేళ పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. అయితే పెళ్లి క్యాన్సిల్‌ విషయమై నాగ్‌ కుటుంబం కానీ, జీవీకే కుటుంబం కానీ అధికారికంగా స్పందించలేదు. అఖిల్‌, శ్రియాల పెళ్లి రద్దుపై అనేక రకాల వార్తలు వచ్చాయి. శ్రియా భూపాల్‌కు మరో వ్యక్తితో పెళ్లి జరుగబోతుంది అని కూడా ప్రచారం అయ్యింది.

తాజాగా ఈ విషయమై నాగార్జున స్పందించాడు. అఖిల్‌, శ్రియాల పెళ్లి డేట్‌ మారింది తప్పితే పెళ్లి క్యాన్సిల్‌ కాలేదని చాలా సున్నితంగా చెప్పాడు. అదేంటి పెళ్లి కాన్సిల్‌ కాకపోతే అనేక రకాలుగా వచ్చిన పుకార్లపై ఎందుకు స్పందించలేదు, ఇదేదో అప్పుడే చెబితే ఇంత రచ్చ ఉండదు కదా, నాగ్‌ చెప్పిన విషయంలో క్లారిటీ లేదు, అఖిల్‌, శ్రియాల పెళ్లి ఆగిపోయినట్టే అని ప్రేక్షకులు అంటున్నారు. కానీ నాగ్‌ మాత్రం సింపుల్‌గా పెళ్లి ఆగిపోలేదు, కేవలం డేట్‌ మాత్రమే మారింది అని చెబుతున్నాడు. పరువు పోతుందని చివరకు శ్రియాను ఒప్పించి మళ్లీ అఖిల్‌, శ్రియాల పెళ్లికి కొత్త డేట్‌ కుదుర్చుతాడా..?? అసలేంటి ఈ మిస్టరీ అని అభిమానులు కంగారు పడుతున్నారు.

Exit mobile version