సీమాంధ్ర ఉద్యమం మూలంగా పెద్ద సినిమాల్నీ వాయిదా పడుతున్నాయి. రావాలా? వద్దా? అని తేల్చుకోలేకపోతున్నాయి. ఎవడు అక్టోబరుకి వెళ్లిపోయింది. అత్తారింటికి దారేది ఎప్పుడొస్తుందో చెప్పలేం. కానీ నాగార్జున మాత్రం వెనకడుగు వేయడం లేదు. భాయ్గా ముస్తాబు అవుతున్నాడు. తనకు ఎలాగూ రాజకీయ నేపథ్యం లేదు. ఆంధ్రా, తెలంగాణల్లో నాగ్కి ఒకేలా ఆదరిస్తారు. కాబట్టి – తన సినిమాకి ఇబ్బందులు ఏమీ ఉండవని ఆయన భావిస్తున్నారు. అందుకే విడుదల తేదీ ఖారారు చేసే పనిలో పడ్డారు. సెప్టెంబరు 27, లేదా అక్టోబరు 4న భాయ్ని విడుదల చేయాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబరు మొదటి వారంలో భాయ్ పాటలొచ్చేస్తాయ్. రామయ్యా వస్తావయ్యా సెప్టెంబరు 27న తీసుకురావాల్సింది. అయితే… ఆ సినిమా ఇంకా డోలాయమాన పరిస్థితిలో ఉంది. అందుకే ఇదే అదునుగా తీసుకొని తన సినిమా తీసుకురావాలనుకొంటున్నాడు కింగ్ నాగార్జున.