దుమ్ము దూలపడానికి పవన్ వస్తున్నాడు – నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు మరోసారి పవన్ కళ్యాణ్ గురించి సభ ముఖంగా మాట్లాడి , జనసేన కార్య కర్తల్లో అలాగే అభిమానుల్లో ఉత్సహం నింపాడు. తాజాగా ఈరోజు జరిగిన నా పేరు సూర్య ఆడియో వేడుకలో నాగబాబు మాట్లాడుతూ సినిమా విశేషాలతో పాటు తాజాగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన పార్టీలు , టీవీ చానెల్స్ గురించి మాట్లాడారు.

పవన్‌ నంబర్‌.1 హీరో.. ఆయన ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయి. సుఖంగా జీవించొచ్చు. ఆయన అలాంటి జీవితం వద్దు అనుకుని, జనం కోసం ఏదో చేద్దామని ఎండల్లో తిరుగుతున్నారు. కెరీర్‌ అయిపోయినప్పుడు పవన్‌ ప్రజాసేవ కోసం రాలేదు.. నంబరు.1 స్థానంలో ఉన్నప్పుడు వచ్చారు. అలాంటి పవన్‌కల్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరికి వారు వ్యక్తి గతంగా టార్గెట్‌ చేస్తున్నారు..ఇదంతా పవన్ కళ్యాణ్ ను చూసి భయపడి ఇదంతా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు ఆయన వెనుకాల చాలామందే పవన్ కళ్యాణ్ లు ఉన్నారు. ఒకేసారి ఏదో జరిగిపోయింది..ఈసారి ఆలా జరగదు దుమ్ము దూలపడానికి పవన్ వస్తున్నాడు ఖబర్దార్ అంటూ ఆవేశం గా నాగ బాబు మాట్లాడారు.