‘కళ్యాణ వైభోగమే’ అంటున్న నాగశౌర్య

Naga-Sourya-Kalyanvybhogame‘చందమామ కథలు’ చిత్రంతో తెలుగు తెర కు పరిచయం అయిన నాగశౌర్య, ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే చిత్రం తో హీరోగా తొలి విజయం అందుకొని మంచి జోష్ మీద ఉన్నాడు. తాజాగా ‘అలామొదలైంది’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన నందినిరెడ్డి దర్శకత్వం లో ఈ యంగ్ హీరో తో ఓ చిత్రం ప్రారంభించింది. దాదాపు 70శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘కళ్యాణ వైభోగమే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తోంది.