మజిలీ హిట్ తర్వాత నాగ చైతన్య లో స్పీడ్ పెరిగింది..వరుసగా తనవద్దకు వచ్చిన కథలను ఓకే చేస్తూ దర్శకులకు డేట్స్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్ లు లైన్లో ఉండగా..తాజాగా ఫిల్ గుడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సినిమా చేసేందుకు సిద్దమైనట్లు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
“నా కెరీర్ మొదటి నుంచి నేను పని చేయాలని ఎదురు చూస్తున్న దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. ఆయనతో ఫైనల్ గా సినిమా ఫిక్స్ అయింది. మరో బ్యూటిఫుల్ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ గారు నిర్మిస్తారు. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. టైమ్ బాగుంది.. మీ అందరి సపోర్ట్ కు కృతజ్ఞతలు. #NC20” అంటూ ట్వీట్ చేశాడు.
సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని చైతు తెలిపినా ఆగష్టు ఫస్ట్ వీక్ నుండే రెగ్యులర్ షూట్ మొదలు పెడతారని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. చైతు – సాయి పల్లవి జోడీ కట్టడం ఇదే మొదటిసారి. గతంలో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సాయి పల్లవి ఫిదా చిత్రం చేసింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో..పల్లవి కి ఎంత పేరు తీసుకొచ్చిందో తెలియంది కాదు. మరి ఈ సినిమాలో ఆమెకు ఎలాంటి రోల్ ఇస్తున్నాడో చూడాలి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల కొత్త నటి నటులతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
ఇక చైతు సైతం వెంకీ తో కలిసి వెంకీమామ అనే సినిమా చేస్తున్నాడు. బాబీ ఈ చిత్రానికి డైరెక్టర్.
Someone I’ve been wanting to work with from the time I started my career.Sekar Kammula.and it’s finally happening ! Another beautiful love story true in every way produced by Sunil Narang..shoot starts September 2019 !! Times are good..blessed..thank you for all the support #nc20
— chaitanya akkineni (@chay_akkineni) 20 June 2019