అక్కినేని హీరో ‘బదాయి హో’కి సిద్దం

నాగచైతన్య ‘మజిలీ’ చిత్రం తర్వాత సినిమాల ఎంపిక విషయంలో చాలా జోరు కనబర్చుతున్నాడు. ఇప్పటికే వెంకీ మామ చిత్రాన్ని చేస్తున్న నాగచైతన్య తాజాగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఒక చిత్రంను చేస్తున్నాడు. ఆ చిత్రంలో ఫిదా హీరోయిన్‌ సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఆ చిత్రం ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలెక్కక ముందే అప్పుడే నాగచైతన్య కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలు అయ్యాయి.

బాలీవుడ్‌లో గత ఏడాది వచ్చిన బదాయి హో చిత్రంకు రీమేక్‌గా నాగచైతన్య మూవీ తెరకెక్కబోతుంది. బోణీ కపూర్‌ మరియు దిల్‌రాజులు ఈ చిత్రంను నిర్మించబోతున్నారు. దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. కాని నాగచైతన్యకు ఆ ప్రాజెక్ట్‌పై చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే నాగచైతన్య మరియు సమంతలు కలిసి ఈ రీమేక్‌లో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ రీమేక్‌ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం అయ్యే అవకాశంది.