Site icon TeluguMirchi.com

అక్కినేని బ్రదర్స్‌ మల్టీస్టారర్‌ ఫిక్సయినట్లేనా?

అక్కినేని నాగచైతన్య వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ పర్వాలేదనిపించుకుంటున్నాడు. కానీ అఖిల్‌కు మాత్రం ఒక్క హిట్‌ పడడం లేదు. అఖిల్‌ సక్సెస్‌ కోసం నాగ్‌తో పాటు అభిమానులు కూడా చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు. ‘మనం’ చిత్రంతో మూడు తరాల వారు ఒకే తెరపై కనిపించి ప్రేక్షకులను కనువిందు చేశారు. అయితే అప్పటి నుండి కూడా అక్కినేని అభిమానులు మరోసారి చైతూ, అఖిల్‌లను ఒకే తెరపై చూడాలని ఆశపడుతున్నారు. అక్కినేని వర్గం కూడా అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

అక్కినేని బ్రదర్స్‌ ఎవరి దర్శకత్వంలో నటిస్తున్నారు అని అనుకుంటున్నారా? అదేనండి ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ భూపతి చాలా కాలంగా ‘మహాసముద్రం’ పేరుతో ఒక స్క్రిప్టును రెడీ చేసిన విషయం తెల్సిందేగా. ఈ కథను ఇప్పటికే చాలామంది హీరోలకు వినిపించాడు. ఈ చిత్రాన్ని భవ్య బ్యానర్‌పై తెరకెక్కనుంది. అయితే ఈ మల్టీ స్టారర్‌లో అక్కినేని సోదరులు నటిస్తారనేది తాజా వార్త. ఈ విషయమై దర్శకుడు అజయ్‌ భైపతి లేదా భవ్య బ్యానర్‌ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version