నాగార్జున సెంచరీ సినిమాలవైపు పరుగు పెడుతున్నారు. గ్రీకువీరుడు ఈమద్యే వచ్చింది. వెంటనే ‘భాయ్’ సినిమా పనిలో పడిపోయారు. ఆ తరవాత ‘మనం’ ఉండనే ఉంది. వీటి తరవాత చేయబోయే సినిమాలు కూడా ఒకొక్కటీ ఖరారవుతున్నాయి. ఆయన దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ సినిమాల్లో నటించే అవకాశాలున్నాయి. దాసరి-అక్కినేని నాగేశ్వరరావు కలయికలో ‘ఏడంతస్తుల మేడ’ సినిమా వచ్చింది. ఈ సినిమాని దాసరి ఇప్పుడు నాగార్జునతో రీమేక్ చేయాలనుకొంటున్నారు. ఇప్పటికే దాసరి.. నాగ్ కి ఈ సినిమా సీడీ ఇచ్చాటర. ఈ సినిమా చూసి, త్వరలోనే తన నిర్ణయం చెబుతానని నాగ్ అంటున్నారు. మరోవైపు కె.విశ్వనాథ్ కూడా నాగ్ కోసం ఓ కథ సిద్ధం చేసుకొన్నారట. ఈ కథ నాగ్ కి వినిపించడం, ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతాయి? అనేదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే నాగ్ కి చేతినిండా సినిమాలున్నాయి. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతను కూడా ఆయనే చూసుకొంటున్నారు. ఈ సీరియర్ దర్శకుల సినిమాలు మొదలవ్వాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది.