Site icon TeluguMirchi.com

Naa Saami Ranga : ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీసు కొడుతున్నాడు


కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా అలరిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ‘నా సామిరంగ’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులకు నమస్కారం. సంక్రాంతి అంటే సినిమా పండగ. టీవీలు వచ్చినపుడు సినిమాలు ఇంక చూడరని అన్నారు. తర్వాత ఫోన్లు వచ్చాయి చూడరని అన్నారు. డీవీడీలు, డిజిటల్ వచ్చిన తర్వాత చూడరని అన్నారు. కానీ ప్రేక్షకులు సినిమాలు చూస్తూనే వున్నారు. ఓటీటీ వచ్చిన తర్వాత చూడరు అన్నారు. కానీ చూస్తూనే వున్నారు. కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే వున్నారు. పండగ రోజున సినిమా చూడటం అనేది ఆనవాయితీ. నాలుగు సినిమాలు వచ్చినా చూస్తారు. మన తెలుగువారికి సంక్రాంతి అంటే సినిమా పండగ. ఈ సంక్రాంతి నాలుగు సినిమాలు వస్తున్నాయి. పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ‘గుంటూరుకారం’తో వస్తున్న మహేష్ బాబుకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. బాల నటుడిగా తేజని చూశాను. ఇప్పుడు తను హీరోగా ‘హను-మాన్’ అనే సినిమాతో వస్తున్నాడు. తనకి ఆల్ ది బెస్ట్. మా వెంకీ 75వ చిత్రంగా ‘సైంధవ్’ తో వస్తున్నారు. తనకి ఆల్ ది బెస్ట్. మేము ‘నా సామిరంగ’తో వస్తున్నాం. మేము ఇచ్చే సినిమా మీకు నచ్చితే ఎంత ఆదరిస్తారో అలా రెండు పండగలు చూశాం. మీకు సినిమా నచ్చుతుంది. ఈ పండక్కి కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

మా సినిమాకి స్టార్ కీరవాణి గారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాటలు ఇచ్చారు. ఈ సినిమాని మూడు నెలల్లో పూర్తి చేశామంటే ఆయన మా వెనుక వుండి ముందుకు నడిపించారు. సినిమా స్టార్ట్ అవ్వకముందే మూడు పాటలు, ఒక యాక్షన్ సీక్వెన్స్ కి నేపధ్య సంగీతం చేసి మా ముందు పెట్టారు. కీరవాణి గారు లాంటి టెక్నిషియన్ వుంటే ఏదైనా సాధిస్తాం. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ వెన్నుతట్టి ఆయన వెనుక వుండి కీరవాణి గారు, చంద్రబోస్ గారు ప్రోత్సహించారు. మూడు నెలలు పాటు టీం అంత ఒక ఫ్యామిలీలా వుండి ఈ సినిమా తీశాం. మూడు నెలల్లో సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. కానీ చేశాం. ఈ కష్టం ఫలించిందా లేదా అనేది జనవరి 14న తెలుస్తుంది.

సెప్టెంబర్ 20నాన్న గారి పుట్టిన రోజున ఆయనకి వందేళ్ళు వచ్చిన రోజున ఆయన విగ్రహం ఆవిష్కరించినపుడు ఆయనకి నమస్కరించుకునప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ‘వెళ్లి సినిమా చేయ్.. నా సామిరంగ’ అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతో సినిమాని పూర్తి చేశాం. ఈ టీం గురించి, వాళ్ళు పడిన కష్టం గురించి ఇప్పుడు చెప్పను.. సక్సెస్ మీట్ లో చెప్తాను. మూడు నెలల్లో సినిమా ఎలా తీయొచ్చు అనేది ఒక పుస్తకం కూడా రాసిస్తాం. సినిమా విడుదల సందర్భంగా అక్కినేని అభిమానులకు ఒక మాట చెప్పాలి. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీసు కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version