సూర్య నిరాశ పరిచాడా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తో అభిమానులను నిరాశ పరిచాడా..? అంటే అవుననే అంటున్నారు అభిమానులు. వక్కంతం వంశీ డైరెక్షన్లో దేశ భక్తి నేపథ్యం లో తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. మొదటి సరి అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించడం , ట్రైలర్ అదరగొట్టడం తో సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంత అనుకున్నారు.

కానీ తీరా థియేటర్స్ లోకి వెళ్తే కానీ తెలియలేదు సినిమా కు హైప్ తప్ప మేటర్ లేదని..ఫస్ట్ హాఫ్ వరకు బాగానే నడిపించిన వంశీ , సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా వదిలేసాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. వంశీ మొదటి సినిమానే ఇలా చేశాడేంటి, అందుకే ఎన్టీఆర్ వంశీ ని పక్కన పెట్టాడా..అని అంత మాట్లాడుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో అని ఖంగారు పడుతున్నారు.. సమ్మర్ లో వచ్చిన రంగస్థలం , భరత్ అనే నేను సూపర్ హిట్స్ కొట్టడం తో నా పేరు సూర్య కూడా హిట్ గా నిలిచి మెగా అభిమానులను సంబరాల్లో నింపుతుందని అనుకుంటుంటే ఇలా అయ్యిందేంటని బాధపడుతున్నారు.