సందీప్ కిషన్ జోరుమీద ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన డికెబోస్గా ముస్తాబవుతున్నాడు. మరోవైపు డీ ఫర్ దోపిడీ కూడా రెడీ అవుతోంది. ఈ లోగా మరో కొత్త సినిమా పట్టాలెక్కింది. సందీప్ కిషన్ కథానాయకుడిగా ‘రారా కృష్ణయ్య’ అనే చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. కృష్ణవంశీ శిష్యుడు మహేష్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రెజీనాని కథానాయికగా ఎంచుకొన్నారు. రొటీన్ లవ్ స్టోరీలో సందీప్, రెజీనా జంటగా నటించారు. ఇది వారికి రెండో చిత్రం. ఈనెల 26 వరకూ హైదరాబాద్లోనే చిత్రీకరణ జరుగుతుంది. ఆ తరవాత కేరళలో కొన్ని సన్నివేశాలు, పాటలు తెరకెక్కిస్తారు. సోలోలాంటి విజయవంతమైన చిత్రాన్ని తీసిన వంశీకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత.