సినిమా తీయడం మానేస్తాం

Murali-Mohanచిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కి వచ్చిన మురళి మోహన్ విలేఖరులతో మాట్లాడుతూ “సినీ పరిశ్రమ వారిపై విధిస్తున్న సేవా పన్ను రద్దు చేయాలంటూ ఇటీవలే నిరసన తెలిపినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా భాదగా ఉన్నదని, సేవా పన్ను రద్దు చేయకపోతే సినిమాలు తీయడం మానేస్తామని అన్నారు. నిర్మాతల పరిస్థితి అటెండర్ల కన్నా దయనీయంగా మారిందని, ఈ సేవా పన్ను విషయమై రాష్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక చలనచిత్ర నిర్మాతలందరితో కలసి కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ను త్వరలోనే కలవనున్నాం అని తెలియజేశారు. వాయులింగేశ్వరుని కోసం శ్రీకాళహస్తి వెళ్ళిన ఆయన అక్కడ పై విదంగా స్పందించారు.