ముంబైలో ‘బాహుబలి 2’ ప్రీమియర్‌ షోలు రద్దు

bahubaliటాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం నేటి సెకండ్‌ షో అనగా రాత్రి 9గంటల పెయిడ్‌ ప్రివ్యూలు ప్రదర్శితం కానున్నాయి. బెనిఫిట్‌ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో పెయిడ్‌ ప్రివ్యూలను ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో కూడా ప్రివ్యూలు ప్రదర్శించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీ ‘బాహుబలి 2’ను కరుణ్‌ జోహార్‌ సొంతం చేసుకుని అక్కడ భారీ స్థాయిలో ప్రమోషన్‌ చేశాడు. నేడు ముఖ్య సినీ ప్రముఖులకు ‘బాహుబలి 2’ ప్రీమియర్‌ షోను ప్రదర్శించాలనుకున్నారు.

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు వినోద్‌ ఖన్నా మృతి చెందడంతో ముంబైలోని ప్రీమియర్‌ షోలను రద్దు చేశారు. వినోద్‌ ఖన్నా మృతికి సంతాపంగా నేటి షోలన్నీ కూడా రద్దు చేశారు. ఇక ‘బాహుబలి 2’ ప్రీమియర్‌ షోను కూడా రద్దు చేస్తున్నట్టు బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ ప్రకటించారు. రేపటి నుండి అన్ని షోలు యథావిధిగా ప్రదర్శింపబడాతాయని కరుణ్‌ జోహర్‌ తెలిపారు. తెలుగుతో పాటే అన్ని భాషల్లో కూడా ‘బాహుబలి 2’పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.