మాస్ మసాలా సినిమాలే కాదు. సృజనాత్మకత నిండిన కథలూ అప్పుడప్పుడూ వెండి తెరపై దర్శనమిస్తుంటాయి. అనుభూతుల పరిమణాలు వెదజల్లడానికి అలాంటి మరో సినిమా వస్తోంది.. అదే.. మల్లెల తీరంలో- సిరిమల్లె పువ్వు. రామరాజు దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆయనకు ఇదే తొలి సినిమా. అయినా సరే – చిత్రపరిశ్రమలో అందరినీ ఆకట్టుకొన్నాడు. మంచి టైటిల్, ఆహ్లాదకరమైన టైటిల్ తో ఓ ఫీల్ గుడ్ సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగిస్తున్నాడు. ఈ సినిమాకి కొంతమంది సినీ ప్రముఖులకు చూపించాడు రామరాజు. సినిమా చూసిన వాళ్లంతా.. థ్రిల్ ఫీలయ్యారు. శేఖర్ కమ్ముల అయితే.. ఈ సినిమాకి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ”నేను చూసిన మంచి సినిమాల్లో ఇదొకటి. నాలుగు రోజుల పాటు నన్ను వెంటాడుతూనే ఉంది” అని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల అభిరుచిపై తెలుగు ప్రేక్షకులకు కొండంత నమ్మకం. ఆయనకు నచ్చిందంటే… కచ్చితంగా విషయం ఉండే ఉంటుంది. మరి ఈ సినిమాని మనం చూడాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాలి.