సర్వీస్ ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ పాటించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో బంద్ విరమించినప్పటికీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేస్తూ మార్చి 16 నుంచి కొత్త సినిమా విడుదల మాత్రమే కాదు.. షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిలిపివేయనుంది. ముఖ్యంగా ఆరు డిమాండ్లతో టీఎఫ్పీసీ ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించనుంది.
* క్యూబ్, యూఎఫ్వోలు ఇక నుంచి వర్చువల్ ప్రింట్ ఫీజును వసూలు చేయకూడదు.
* టికెట్ ధరలలో మార్పులు
* ఆన్లైన్ బుకింగ్ ఛార్జీలను తగ్గించాలి.
* అన్ని థియేటర్లలో టికెట్లను కంప్యూటరైజ్డ్ చేయాలి.
* చిన్న సినిమాల ప్రదర్శనకు తగిన థియేటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
* ప్రొడక్షన్ వ్యయాన్ని నియంత్రించాలి.
ఈ డిమాండ్లతో బంద్ ని కొనసాగించనున్నారు