స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో పీకల్లోతు మునిగిపోయి తన కెరీర్ కు మాయని మచ్చ తెచ్చుకొన్నాడు శ్రీకాంత్. ఇప్పుడు జైలు గోడల మధ్య కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడట. శ్రీశాంత్ కన్నీళ్లతో చెలిమి చేస్తోంటే… అతని కథతో సినిమా చేయడానికి అప్పుడే సన్నాహాలు జరిగిపోతున్నాయి. శ్రీశాంత్ కెరీర్ లోని ఒడిదుడుకులను, అతని వైఫల్యాలూ, పోరాటం.. ఇవన్నీ ఓ సినిమాగా వస్తోంది. మలయాళీ దర్శకుడు షాజీ కైలాస్ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ‘క్రికెట్’ అనే పేరు కూడా పెట్టేశారు. శ్రీశాంత్ ఈ స్థాయికి ఎదగడానికి చాలా కష్టపడ్డాడు. కేరళకు గర్వకారణంగా నిలిచాడు..ఇప్పుడు ఫిక్సింగ్ ఉదంతంలో కూరుకుపోవడం బాధాకరమే. అయితే… అతని జీవితం గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది… అందుకే అతని కథను సినిమాగా తీర్చిదిద్దుతున్నాం.. అంటున్నారు.