మెల్లమెల్లగా తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలు ఊపందుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వెంకటేశ్ ఈ దిశగా వడివడిగా అడుగులేస్తూ సాగిపోతున్నాడు. తను ఇప్పటికే శ్రీకాంత్, మహేశ్, రామ్ వంటి వారితో కలిసి నటిస్తున్నాడు. త్వరలో పవన్ కళ్యాణ్ తో కూడా నటిస్తున్నానని ప్రకటించాడు. ఇప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా రెడీ అయిపోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ లో ఫిరోజ్ ఖాన్, నానాపాటేకర్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్ నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం “వెల్ కం” తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడట. ఇందులో ప్రధాన పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడని తెలిసింది. బహుశా నానా పాటేకర్ పాత్రలో మోహన్ బాబు కనిపిస్తాడని ఊహాగానం. మరో ముఖ్యపాత్రలో సునీల్ నటిస్తాడని తెలిసింది. మిగిలిన పాత్రధారులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడవుతాయని సమాచారం.