‘కొబ్బరి మట్ట’ చిత్రం కోసం సంపూర్నేష్బాబు చెప్పిన మూడున్నర నిమిషాల డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచ సినీ చరిత్రలో ఇలాంటి ఇంతటి లెంగ్తీ డైలాగ్ను ఏకబికీన చెప్పిన నటుడు లేడు అంటూ ప్రశంసలు అందుకుంటున్న సంపూర్నేష్బాబుకు తాజాగా మోహన్బాబు నుండి కాల్ వచ్చిందట. ట్రైలర్ చూసిన మోహన్బాబు ప్రశంసలు కురిపించినట్లుగా స్వయంగా సంపూర్నేష్బాబు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
ట్రైలర్ చూసిన మోహన్ బాబు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. నన్ను అభినందించారు. ఈ జన్మకు ఇది చాలు. ఆయన డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ నేను ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వచ్చాను. అలాంటి గొప్ప వ్యక్తి నుండి నాకు ప్రశంసలు అందడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మాటలు జీవితంలో మర్చి పోలేను అంటూ సంపూర్నేష్బాబు అన్నాడు. కొబ్బరి మట్ట చిత్రం ఆగస్టు 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హృదయకాలేయం చిత్రంతో మంచి సక్సెస్ను దక్కించుకున్న కొబ్బరిమట్టతో మరో బ్లాక్ బస్టర్ను కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.